పెద్దపల్లిరూరల్: తమపై వివక్షను వీడి ఆదుకోవాలని తెలంగాణ లెక్చరర్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్కుమార్ కోరారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణకు వినతిపత్రం సమర్పించారు. లాక్డౌన్ కారణంగా ఏడాదిగా వేతనాలు సక్రమంగా అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని, లెక్చరర్లు, బోధనేత సిబ్బందిని ప్రభుత్వం ఆదుకునేలా దృష్టి సారించాలని కోరారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రైవేటు టీచర్లకు అందించే సహాయం మాదిరిగా కళాశాలల్లో పని చేసే లెక్చరర్లకు రూ. 5వేలు నెల నెల అందించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ పోకల నాగయ్య, సలహాదారు బండారు సురేశ్, రమేశ్, రవీందర్, సతీష్, శ్రీధర్, సమద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement