Saturday, September 7, 2024

TS: వంద రోజులు పూర్తయ్యాయి.. ఆరు గ్యారెంటీలు ఎక్క‌డ‌.. బండి సంజ‌య్

క‌రీంన‌గ‌ర్ – దయచేసి ఆలోచించాలని, అందరి గురించి మోడీ ఆలోచిస్తున్నారని, మీరు పువ్వు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తే నేను వెళ్లి మోడీకీ ఓటేస్తా అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజాహిత యాత్రలో భాగంగా ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన గడువు ఇయాళ్టితో ముగిసిందని తెలిపారు. కానీ వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ఎన్నికల హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది. ఎందుకు అమలు చేయలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని బండి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement