Friday, September 13, 2024

Peddapalli: నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి.. ఏసీపీ కృష్ణ

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా నిర్వాహకులు సహకరించాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లిలో వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ… వినాయక చవితి పండుగ వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, మండప నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపానికి అనుమతి మొదలుకొని వేడుకల్లో భాగంగా తీసుకునే జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది రాకుండా సామరస్యంగా వ్యవహరించాలన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్‌ శాఖకు సహకరించాలని, అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐలు లక్ష్మణ్‌రావు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement