Thursday, September 12, 2024

Peddapalli: భూసేకరణ నోటిఫికేషన్ పకడ్బందీగా విడుదల చేయాలి : కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆగస్టు 23 (ప్రభన్యూస్‌): ఎన్టీపీసీలోని తెలంగాణ పవర్‌ ప్లాంట్‌ స్టేజి 2 యాష్‌ డైక్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్‌ పకడ్బందీగా విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సమీకృత కలెక్టరేట్‌లో ఎన్టీపీసీ భూసేకరణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌లతో కలిసి నిర్వహించారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ… అంతర్గాం మండలం మొగల్‌ పహాడ్‌ గ్రామంలో తెలంగాణ పవర్‌ ప్లాంట్‌ స్టేజి- 2 యాష్‌ డైక్‌ నిర్మాణానికి అవసరమైన 600 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ భూ సేకరణ చట్టం 2013 ప్రకారం విడుదల చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్టీపీసీ ద్వారా టోపోగ్రాఫికల్‌, జియో టెక్నికల్‌ సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్టీపీసీ సేకరించిన 9543 ఎకరాల భూమి మ్యూటేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డీఓ బి.గంగయ్య, సహాయ సంచాలకులు సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాసులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement