Thursday, September 19, 2024

సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

ఎల్లారెడ్డిపేట: మండలంలోని బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఐటీ- శాఖ మంత్రి కేటీ-ఆర్‌ చిత్రపటాలకు సర్పంచ్‌ అజ్మీర రజిత తిరుపతి నాయక్‌ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కొత్త గ్రామపంచాయతీ ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యాయని, ఎస్టి కమ్యూనిటీ- హాల్‌లో గ్రామ పంచాయతీని ఏర్పాటు- చేసుకున్నామన్నారు. అయితే మంత్రి కేటీ-ఆర్‌ గ్రామానికి రూ. 20 లక్షలతో నూతన పంచాయతీ భవనం ఏర్పాటు- చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈకార్యక్రమంలో ఎస్టీసెల్‌ మండల అధ్యక్షులు అజ్మీర తిరుపతి నాయక్‌, గ్రామ శాఖ అధ్యక్షులు అజ్మీరా రవినాయక్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, కో- ఆప్షన్‌ సభ్యులు, టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బాల్‌సింగ్‌ నాయక్‌, సనానవత్‌ రమేష్‌నాయక్‌, గజన్‌ నాయక్‌, దేవేందర్‌, హేమజి నాయక్‌, మానస, పద్మ, ప్రమీల, లక్ష్మి లు పాల్గొన్నారు. అలాగే దేవునిగుట్ట తండాలోనూ పాలకవర్గం ఆధ్వర్యంలో సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ గుగులోతు పెంటయ్యతోపాటు తెరాస నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement