Friday, September 20, 2024

KNR: రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.. విప్ లక్ష్మణ్ కుమార్

ధర్మపురి, ఆంధ్రప్రభ : రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్ర‌భుత్వ విప్, ధ‌ర్మ‌పురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలియజేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో దోనూర్ గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో, కమలాపూర్ గ్రామంలో రూ.11 లక్షల వ్యయంతో, నేరెళ్ళ గ్రామంలో రూ.34 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎరువుల గోదాములను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… రైతులకు మేలు చేసే ఇట్టి ఎరువుల గోదాములను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని, ఎరువుల విషయంలో ఎటువంటి ఇబ్బందులున్నా త‌న‌ దృష్టికి తీసుకురావాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడం జరిగిందనీ, రుణాలు మాఫీ కానీ రైతులు ఎవ్వరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, రుణమాఫీ కాని రైతుల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు.

- Advertisement -

వాటిని త్వరలోనే పరిష్కరించి రుణమాఫీ వారికి వర్తింప చేస్తామని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను వందకు వంద శాతం అమలు చేయడం జరుగుతుందని, ఈ ప్రాంతానికి సంబంధించి లిఫ్ట్ లను కూడా గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వలన పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడం జరిగిందని, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వాటికి మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తామని, 2016 లో ప్రారంభమైన రోళ్ళ వాగును గత ప్రభుత్వ హయంలో పూర్తి చేయలేదని, దానికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ నుండి కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు నా దృష్టికి తీసుకురావడం జరిగిందనీ, అట్టి విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని కూడా పూర్తి చేస్తామని,అదే విధంగా పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి ధర్మపురి నియోజకవర్గ ప్రాంత రైతాంగానికి నీరు అందిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement