Sunday, September 8, 2024

మోడీకు హఠావో.. దేశ్‌కో బచావో..

కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్‌ మహాధర్నా

వేములవాడ : దేశ ప్రధానమంత్రి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వేములవాడ కాంగ్రెస్‌ నాయకులు బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ముందు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి, టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా దేశాన్ని నడిపించాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రశ్నించిన వారిపై ఈడి, సిబిఐ దాడులు నిర్వహించి రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు మోడీకు హటావో.. దేశ్‌ కు బచావో.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు సాగరం వెంకటస్వామి, చిలుక రమేష్‌, పాత సత్యలక్ష్మి, సంగ స్వామి, కనుకయ్య, వకులాభరణం శ్రీనివాస్‌, నాగుల విష్ణు, చంద్రగిరి శ్రీనివాస్‌, లతోపాటు- పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement