Tuesday, September 17, 2024

Peddapalli: ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

.. ప్రజా పాలన అందిస్తున్నాం
.. మహిళా కమిషన్ చైర్ పర్సన్

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మహిళా కమిషన్ రాష్ట్ర చైర్ పర్సన్ నేరెళ్ల శారద జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

పెద్దపెల్లి జిల్లాలో 43వేల మంది రైతులకు 273కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో మరింత అభివృద్ధి జరుగుతుందని, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చే బాధ్యత అధికారులదేనన్నారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ చేతన, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ ర‌మ‌ణారావు, రేవతి రావుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement