Friday, September 20, 2024

పృథ్వి గ్రాఫిక్స్‌ శీను ఇకలేరు..

వేములవాడ: వేములవాడ పట్టణంలో గత రెండు దశాబ్దాలుగా పృథ్వి గ్రాఫిక్స్‌, ప్రింటర్స్‌తో పేరుగాంచిన పుల్లూరు శ్రీనివాస్‌ ఆకస్మికంగా మరణించారు. శ్రీనివాస్‌ మరణవార్త తెలుసుకున్న తెరాస నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, నరాల శేఖర్‌ పుర ప్రముఖులు శ్రీనివాస్‌ మృతదేహానికి నివాళులర్పించారు. పట్టణంలో ప్రింటింగ్‌, గ్రాఫిక్స్‌ పనులు చేయడంలో పేరుగాంచిన శ్రీనివాస్‌ మరణ వార్త పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. జరిగిన అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని శ్రీనివాస్‌కు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

పరామర్శ
వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని శాత్రాజుపల్లిలో మరణించిన పొన్నాల యాదయ్య కుటుంబాన్ని టీ ఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఏనుగు మనోహర్‌ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలి పారు. ఆయన వెంట పొన్నాల మోహన్‌, గడ్డం శ్రీనివాస్‌, వనపర్తి రవి, మేడిచెల్మల ఆదిత్య, పొన్నాల మల్లేశం, పొన్నాల మహేష్‌, పొన్నాల శ్రీను తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement