Wednesday, July 3, 2024

TS: కలెక్టరేట్ లో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం..

జనగామ కలెక్టరేట్లో ఓ మహిళా రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇటీవలే భూ వివాదం నేపథ్యంలో ఓ రైతు పురుగుల మందు తాగి కలెక్టరేట్ భవనం పైకిక్కి బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఆ సంఘటన మరవక ముందే తాజాగా జనగామ జిల్లా నర్మెట మండలానికి చెందిన దేవరపల్లి జ్యోతి తన వ్యవసాయ భూ సమస్య విషయమై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగించింది.

భూ వివాదంలో జ్యోతి గత కొద్ది రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా, పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది సోమవారం కలెక్టరేట్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే అప్పటికే ఇంటివద్ద నిద్ర మాత్రలు మింగి ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి జ్యోతి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జ్యోతిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్ప‌త్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement