Tuesday, September 17, 2024

KNR: మృతుల‌ కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా అంద‌జేత‌

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావులు అందజేశారు.

మంగళవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో రెండు రోజుల క్రితం వరదల్లో మృతిచెందిన బిల్ కలెక్టర్ చెప్యాల పవన్, మత్స్యకారుడు గోస్కుల కుమార్ ల కుటుంబాలను పరామర్శించి ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును అందజేశారు. భారీ వర్షాలతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని ఎక్స్ గ్రేషియా ప్రకటించారన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement