Friday, October 18, 2024

TG | మంథని ఆర్డీఓను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ

పెద్దపల్లి జిల్లా మంథని ఆర్డీఓ హనుమా నాయక్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ మేర‌కు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీఓ హనుమాన్ నాయక్ పరిపాలనలో, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకే ఆర్డీఓను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఆర్డీఓపై గత కొన్ని నెలలుగా ఫిర్యాదులు రావడంతోనే అతన్ని ఉన్నట్టుండి సరెండర్ చేసినట్టు పేర్కొన్నారు. గత 20 రోజుల క్రితం మంథని మున్సిపల్ కమిషనర్ మల్లికర్జున స్వామిని సరెండర్ చేసిన కలెక్టర్, జిల్లాలో అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో సరెండర్ తో కలెక్టర్ మరోసారి హెచ్చరించినట్లు కనిపిస్తుంది. దీంతో జిల్లాలోని అధికారులు వారి ప్రవర్తన మార్చుకొని ఇకనైనా విధులు సక్రమంగా నిర్వహిస్తారో లేదోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement