Friday, September 20, 2024

TG: రేపు పెద్దపల్లికి ఉప ముఖ్యమంత్రి.. ఏర్పాట్లను పరిశీలించిన సీపీ, కలెక్టర్

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ధర్మారం, జూలపల్లి, పెద్దపల్లి మండలాల్లో పలు సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉపముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

ఈ మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ధర్మారం మండలంలో ఏర్పాట్లను పరిశీలించారు. హెలిఫ్యాడ్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement