Thursday, September 19, 2024

పోలీస్‌స్టేషన్‌ ఎదుట కాంగ్రెస్‌ నాయకుల బైఠాయింపు

వేములవాడ: వేములవాడ అర్బన్‌ రూరల్‌ పట్టణ కాంగ్రెస్‌ నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ గేట్‌ వద్ద బైఠాయించారు. గత మూడు రోజులుగా కాంగ్రెస్‌ నాయకులను కార్యకర్తలను ముందస్తు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకు రావడాన్ని నిరసిస్తూ సుమారు 30 మంది కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌స్టేషన్‌ గేటు- ఎదురుగా బైఠాయించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకటేష్‌ కాంగ్రెస్‌ నాయకులతో మాట్లాడి వారిని పోలీస్‌స్టేషన్‌లోనికి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు సాగరం వెంకట స్వామి, చిలుక రమేష్‌, వకులాభారణం శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రమేష్‌ బాబు గత ఏడాది కాలంగా వేములవాడ నియోజకవర్గంలో లేకపోవడం పట్ల ప్రశ్నించిన వారిని ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement