Thursday, July 4, 2024

TG: బీఆర్ఎస్ పదేళ్ళలో అరాచక పాలన… ప్రభుత్వ విప్ అడ్లూరి

పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అరాచకపు పాలన సాగిందని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం మంత్రులకు సైతం అపాయింట్ మెంట్ ఇవ్వకుండా పాలన సాగించారని నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు వింటూ పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. కేటీఅర్ దేవుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు.. ఊరుకోమన్నారు.

తాము ఎవ్వరినీ పార్టీలు మారమని ప్రోత్సహించలేదు, వారే వచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని అమలు చేశారో కేటీఆర్ చేప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, నాయకులు వేముల రాజేష్, చిలుముల లక్ష్మణ్, సింహారాజు ప్రసాద్ జక్కు రవి, మురళి, అసెట్టి శ్రీనివాస్, జె సుముక్, వొజ్జల లక్ష్మణ్, అప్పం తిరుపతి, గాజు సాగర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement