Thursday, September 19, 2024

KNR: ఆస్పత్రులన్నీ బంద్.. రోగుల అవస్థలు..

దాడులు సహించేది లేదు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : వైద్యునిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆసుపత్రులన్నీ మూసివేశారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రిలన్నీ మూసివేసి వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పిల్లల వైద్య నిపుణులు రాజేష్ పై కత్తితో దాడి చేసిన గాయపర్చిన అంశాన్ని ఐఎంఏ తీవ్రంగా పరిగణించింది.

ఆస్పత్రాన్ని మూసివేసి వైద్య సేవలను నిలిపివేశారు. వైద్యులపై దాడి చేస్తే సహించేది లేదని, వైద్యుడు రోగి ప్రాణాలను తీయాలనుకోడని, ప్రాణం పోసే వైద్యులపై దాడి సరైంది కాదన్నారు. ఆస్పత్రిలన్నీ మూసివేయడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement