Saturday, September 21, 2024

KNR: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి.. ఎమ్మెల్యే విజయ రమణారావు

వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. ఇవాళ వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా పెద్దపల్లి మండలంలోని కల్వల క్యాంప్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ… పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement