Tuesday, September 17, 2024

పేదలను ఆదుకోవడమే లక్ష్యం – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద ్దపల్లి: పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పాలన సాగిస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన సంకరి సంతోష్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 1.50లక్షల ఎల్‌ఓసీని ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నిరుపేదల కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆపద సమయంలో ఉన్న వారిని ఆదుకునేందుకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతగానో దోహదపడుతుందన్నరు. అనారోగ్యం, ప్రమాదంలో గాయపడి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ వీరగోని రమేశ్‌ గౌడ్‌, కో- ఆప్షన్‌ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement