Tuesday, September 17, 2024

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

వేములవాడ: అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతి వేడుకలను వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కట్కం జనార్దన్‌, గౌరవాధ్యక్షుడు నగుబోతు రవీందర్‌, కట్కం నాగరాజు, ప్రధాన కార్యదర్శులు సిద్దంశెట్టి వేణు, గంప రమేశ్‌, కోశాధికారి ఎరవెల్లి రాజశేఖర్‌, ఆర్యవైశ్య నాయకులు ప్రసాద్‌, సుధాకర్‌, మాడూరి శ్రీనివాస్‌, సత్యనారాయణ, రాజేందర్‌, అనిల్‌, తాటికొండ పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement