Friday, October 18, 2024

Karimnagar – ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు …. ఒకరు మృతి

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా నగునూరులో చోటుచేసుకుంది. అర్ధరాత్రి తర్వాత చొప్పదండి నుండి కరీంనగర్ కు వస్తున్న కారు నగునూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కరీంనగర్ సాయి నగర్కు చెందిన తాటికొండ రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని కారు నుండి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement