Sunday, September 8, 2024

Karimnagar – విజయ దశమి పర్వదినంతో ప్రజలందరికీ శుభాలు కలగాలి – పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు

విజయ దశమి పర్వదినంతో ప్రజలందరికీ శుభాలు కలగాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు ఆకాంక్షించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుధ, వాహన, శమీ పూజలను నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ దసరా పర్వదినాన్ని ఆనందోత్సహాల మధ్య జరుపుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement