Tuesday, September 17, 2024

Karimnagar – విఘ్నాలన్నీ తొలగించి.. సుఖ సంతోషాలు కలిగించాలి : బండి సంజయ్

ఆంధ్రప్రభ కరీంనగర్ – తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి విఘ్నాలు తొలగించి సుఖసంతోషాలు ప్రసాదించాలని గణనాథుడిని వేడుకున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి పూజలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువుల ఐక్యతే లక్ష్యంగా, హిందూ జాగరణనే ధ్యేయంగా లోకమాన్య తిలక్ ప్రారంభించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయవంతం కావాలన్నారు. గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలకు ఎదురవుతున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సకల సంపదలతో, సుఖ సంతోషాలతో అభివ్రుద్ధి వైపు పయనించే శక్తిని ప్రసాదించాలని గణనాథుడిని వేడుకున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement