Thursday, September 12, 2024

Karimnagar – స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ ముస్తాబయింది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పోలీసు బలగాలు హాజరై కవాతు, గౌరవ వందనం, వివిధ పాఠశాలల విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు రిహార్సల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ లక్ష్మీనారాయణ, అనూక్ జయ కుమార్. అడ్మిన్ ఆర్ ఐ రజనీకాంత్. ఎం టి ఓ కుమారస్వామి. సాట్ టీం ఆర్ఐ జానీ మియా లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement