Friday, September 20, 2024

Karimnagar – టీచ‌ర్‌కు బ‌డిత పూజ‌…

వ‌క్ర బుద్ధికి ఆగ్ర‌హించిన బాలిక త‌ల్లిదండ్రులు
స్కూల్ యాజ‌మాన్యానికి ఫిర్యాదు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, క‌రీంన‌గ‌ర్ : వ‌క్ర‌బుద్ధి గ‌ల ఓ ప్రైవేటు పాఠ‌శాల ఉపాధ్యాయుడికి పిల్ల‌ల త‌ల్లిదండ్రులు చిత‌కబాది స్కూల్ య‌జ‌మాన్యానికి ఫిర్యాదు చేశారు. కరీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని బ్రాహ్మ‌ణ‌వీధిలో గ‌ల నారాణ‌య స్కూల్‌లో ప‌నిచేస్తున్న సోష‌ల్ టీచ‌ర్ శ్రీ‌నివాస్ విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని, ఈ విష‌యమై త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌డంతో ఆ టీచ‌ర్‌కు చిత‌క‌బాది అనంత‌రం స్కూల్ యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేశారు.

ప‌రారీలో టీచ‌ర్‌… త‌ల్లిదండ్రుల ఆందోళ‌న‌
పిల్ల‌ల తల్లిదండ్రులు దాడి చేయ‌డంతో ఆ టీచ‌ర్ పారిపోయాడు. దీంతో ఆగ్ర‌హించిన వారు ఆందోళ‌న‌కు దిగారు. పాఠ‌శాల ఫ‌ర్నేచ‌ర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితులను శాంతింపజేసి ఉపాధ్యాయుడిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement