Friday, October 18, 2024

Kamareddy – వాళ్లేం చేశారు … నందివాడ‌లో ఓ తండ్రి ఘాతుకం ..

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌రెడ్డి (35), అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు విఘ్నేష్‌ (6), అనిరుధ్‌ (4)ఉన్నారు. శనివారం రాత్రి 7.30 గంటలకు దుర్గమ్మ నిమజ్జనానికి పిల్లలను తీసుకుని శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు. రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య అతడికి ఫోన్‌ చేసింది. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్‌ చేయలేదు. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఫిర్యాదు చేయడంతో పోలీసులతో పాటు స్థానికులు పరిసర ప్రాంతాల్లో గాలించారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు కనిపించాయి. అప్పటికి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన చెప్పులు, మొబైల్‌ బావి వద్దే ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో పిల్లల మృతదేహాలను బయటకు తీసి బావిలోని నీటిని మోటారు సాయంతో తోడించారు. అనంతరం బావిలోపల శ్రీనివాస్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. తండ్రీకుమారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement