Tuesday, September 17, 2024

TG: ఆయిల్ ఫామ్ రైతులకు న్యాయం చేయాలి..

-మంత్రి తుమ్మలతో కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ రాజసింగ్ చౌహన్ ను కలిసిన
ఆయిల్ ఫామ్ రైతు అసోసియేషన్ అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్

ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శుక్రవారం తెలంగాణ ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ఆలపాటి రామచంద్ర ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసి రైతులు ఎదుర్కొంటున్న‌ సమస్యలపై వివరించారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు కనీసం మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

గతంలో టన్ను 20వేల రూపాయలు ఉండగా.. ఇటీవల కాలంలో కష్టం డ్యూటీని ఎత్తివేసారని తెలిపారు. కష్టం డ్యూటీని తగ్గించిన క్రమంలో టన్ను ధర 12 వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు. కనీసం మద్దతు ధర రూ.20,000లు ఉండేలా చూడాలని కోరారు.

- Advertisement -

అదేవిధంగా తెలంగాణకు కోకోనట్ రీజినల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ను అశ్వారావుపేట (ట్రైబల్, నాన్ ట్రైబల్ శిక్షణ)లో ఏర్పాటు చేయాలని కోరామన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆలపాటి రామచంద్ర ప్రసాద్, రైతు నాయకులు బండి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement