Friday, September 20, 2024

New Chairman – విద్యుత్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బీమ్ రావు లోకూర్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బీమ్ రావు లోకూర్ ను నియమించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇంతకు ముందు కమిషన్ ఛైర్మన్ గా పనిచేసిన జస్టిస్ నరసింహారెడ్డి మీడియాలో ముందుగానే విచార‌ణ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌డంతో సుప్రీంకోర్టు త‌ప్ప‌ప‌ట్టింది.. దీంతో ఆయ‌న క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు.. తాజాగా ఆయ‌న స్థానంలో జస్టిస్ మదన్ భీమ్ రావు ను నియ‌మించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement