Thursday, September 12, 2024

JUDAS Boycott – ప్ర‌భుత్వ హాస్ప‌టల్స్ నిలిచిన ఓపి సేవ‌లు…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోల్ కోతా లో జూ.డాక్టర్ ను లైంగికంగా దాడి చేసి చంపిన ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. దీనిపై జూడాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. ఇవాళ ఆందోళనలో పాల్గొననున్నారు. దీంతో తెలంగాణాలోని ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్ప‌డింది… .

కాగా, కోల్‌కతాలో యువ వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలిపై అత్యాచారానికి తెగబడిన కామాంధుడు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు ఇది ఆత్మహత్య కాదని.. కచ్చితంగా లైంగిక దాడి చేసి చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సంజయ్‌ రాయ్ ను వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

- Advertisement -

అనుబంధ వాలంటీర్‌గా పనిచేస్తున్న నిందితుడు తన పోకిరి చేష్టలతో తరుచూ సదరు వైద్యురాలిని ఇబ్బందులకు గురిచేసేవాడని పోలీసుల విచారణలో తెలిసింది. కాగా వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేశారు. దేశంలోని అనేక నగరాల్లోని పలు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement