Thursday, September 12, 2024

TG | జిట్టా బాలకృష్ణారెడ్డికి తీవ్ర అస్వస్థత…

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : తెలంగాణ ఉద్యమకారుడు, సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పిన భారస రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురి కాగ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్య కారణాలతో గత 35 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా, ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు.

జిట్టా ఆరోగ్య పరిస్థితి పై మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తో పాటు వివిధ పార్టీల నేతలు ఆరా తీశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల అస్వస్థతకు గురైనట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. జిట్టా నెమ్మదిగా కోలుకుంటున్నారని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని జిట్టా యువసేన నాయకులు తెలిపారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement