Sunday, September 8, 2024

కాంగ్రెస్ చరిత్ర తెలుసుకో: మోదీకి జీవన్ రెడ్డి సలహా

రాష్ట్ర విభజనపై పార్లమెంట్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాక రేపుతున్నాయి. బీజేపీపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆపార్టీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘన సోనియా గాంధీదే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్రను మోదీ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణకు తల్లి లాగా సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. అయితే, మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మోదీకి లేదన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళలో బీజేపీ వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement