Friday, September 20, 2024

Jannaram – అప్పుల వేధింపులతో బ్రాంచి పోస్ట్ మాస్టర్ బలవన్మరణం ..


జన్నారం, ( ప్రభ న్యూస్): కొంతమంది అప్పుల వాళ్ళ వేధింపులతో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. ఇది.వివరాలు ఇలా ఉన్నాయి. పొనకల్ బ్రాంచి పోస్ట్ మాస్టర్ వంగపల్లి శ్రీనివాస్ (45) అప్పులు ఇచ్చిన వాళ్లు వే ధింపులు తాళలేక ఈనెల 8న గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి, మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అదే ఆసుపత్రిలో శ్రీనివాస్ చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందాడు. అనంతరం సోమవారం ఉదయం మృతుని భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ లోని ఆ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు సక్రమంగా చికిత్స చేయకపోవడం వల్లనే తన భర్త చనిపోయినట్లు భార్య ఆరోపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement