Thursday, October 3, 2024

Janasenani – ప‌వ‌న్ అంటే మ‌రీ ఇంత అభిమానమా…

అంధ్ర‌ప‌భ స్మార్ట్ – ఖమ్మం – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తన రక్తంతో గీసి ఓ వ్యక్తి అభిమానాన్ని చాటుకున్నాడు. ముదిగొండ మండలానికి చెందిన మాణిక్యం అఖిల్ ఏపీ డిప్యూటీ సీఎం కి వీరాభిమాని. అభిమానానికి గుర్తుగా ప‌వ‌న్ చిత్రం వేయాల‌ని సంక‌ల్పించాడు. అయితే ఈ ఈ చిత్రం విభిన్నంగా ఉండాల‌ని భావించాడు.. దీంతో ర‌క్తంతో గీయాల‌ని నిర్ణయించుకున్నాడు.. ఆ ర‌క్తాన్ని కూడా త‌న శరీరం నుంచే తీసుకుని చిత్రాన్ని అయిదు గంట‌ల‌లో పూర్తి చేశాడు.. ఇందు కోసం 5 ఎం ఎల్ ర‌క్తాన్ని వినియోగించిన‌ట్లు మాణిక్యం చెప్పుకున్నాడు.. తన అభిమానాన్ని విభిన్నంగా తెలియజేయడానికి మాత్రమే ఇలా చిత్రం గీశానని ఆయన తెలిపారు. అంత‌కు మించి ఏం లేద‌ని అత‌డు పేర్కొన్నాడు. ప‌వ‌న్ క‌లిసిన‌ప్పుడు ఈ చిత్రాన్ని ఆయ‌న‌కు గిప్ట్ గా ఇస్తాన‌ని చెప్పాడు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement