Friday, September 20, 2024

Jai Ganesh – ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగ‌ర్ లో నిమ‌జ్జ‌నానికి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

హైద‌రాబాద్ – ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగ‌ర్ లో గ‌ణేష్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధించాలంటూ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ముందు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు వద్దని పిటిషనర్ తన వాదనలు వినిపించారు.

గతేడాది ఇచ్చిన తీర్పునే ఈసారి కొనసాగించాలని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా ‘హైడ్రా’ను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాలని కోరారు. పూర్తి వాదనలు విన్న ధర్మాసనం ‘హైడ్రా’ను ప్రతివాదిగా చేర్చేందుకు నిరాకరించింది. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు తప్పుబట్టింది. అదేవిధంగా ఆ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement