Tuesday, September 17, 2024

J Santosh Kumar – మ‌నుగ‌డ కోసం పోరాటం .. వాటిని చూసి ఎంతో నేర్చుకోవాలి

మొక్క‌లు నాటి ప్ర‌కృతిని కాపాడుకుందాం
వైల్డ్ లైఫ్ ఫొటోగ్ర‌ఫీ అంటే చాలా ఇష్టం
మాజీ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: వైల్డ్​ లైఫ్​ ఫొటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం.. అందుకనే ప్రతి ఆదివారం వన్యప్రాణుల ఫొటోలను షేర్​ చేస్తుంటానని మాజీ ఎంపీ, బీఆర్​ఎస్​ నేత జోగినపల్లి సంతోష్​కుమార్​ తెలిపారు. ట్విట్టర్​ వేదికగా సోమవారం ఆయన కొన్ని ఫొటోలను షేర్​ చేశారు. ఆగస్టు19 ఫొటోగ్రాఫర్లందరికీ మరిచిపోలేని రోజు అన్నారు.. ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇక.. పక్షులు, జంతువులు వాటి మనుగడ కోసం చేసే పోరాటం తనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందని సంతోష్​ తెలిపారు. అదే విధంగా మనుషులుగా మనమూ ఈ ప్రకృతిని కాపాడుకోవాలన్న సంకల్పంతోనే గ్రీన్​ ఇండియా చాలెంజ్​ ప్రోగ్రామ్​ చేపట్టినట్టు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలను తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement