Tuesday, September 24, 2024

IT Raids – కూకట్ పల్లి లో ఐటీ సోదాలు

హైదరాబాద్ – తెలంగాణలో మరోసారి ఐటీ అధికారులు పంజా విసిరారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు.

కూకట్పల్లిలోని సమీపంలోని మూసాపేట్ రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం ఎనిమిది మంది అధికారులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్లోని ‘ఐ బ్లాక్’లో అద్దెకు ఉంటోన్న ఓ న్యూస్ చానల్ యజమాని ఇంట్లో సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. న్యూస్ చానల్తో పాటు ఫైనాన్స్, ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement