Friday, September 20, 2024

Smita Sabharwal | అలా చేసి ఉంటే స‌క్సెస్ నేరుగానే వ‌చ్చేది….

తెలంగాణ ఐఏఎస్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యురాలు స్మితా సబర్వాల్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా అది వివాదానికి దారి తీస్తుంది. ఇటీవ‌లే పూజా ఖేద్కర్ ఘటనపై స్పందిస్తూ.. అఖిల భారత సర్వీసుల్లో వికలాంగులకు రిజర్వేషన్ అవసరమా అంటూ పోస్ట్ చేయ‌గా… అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్మిత అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ఐఏఎస్ అధికారులు కూడా వ్యతిరేకించారు.

తాజాగా స్మితా సబర్వాల్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. పూజా ఖేద్కర్ కుటుంబ సభ్యుల మోసాలపై ఓ నెటిజన్ ‘‘స్కామ్స్, మోసాల కేటగిరిలో పూజా ఖేద్కర్‌కు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్మితా సబర్వాల్ స్పందిస్తూ, అది జరగదని, అయితే ఈ మోసాలు… స్కామ్‌లలో ఉపయోగించే ప్రిపరేషన్, ప్రిపరేషన్ & స్ట్రాటజీ.. సివిల్స్ సాధించ‌టంపై మీద పెట్టి ఉంటే విజయం నేరుగా వచ్చేదంటూ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement