Thursday, October 17, 2024

TS: బీజేపీ అధికారంలోకి రావడం పక్కా… క‌రీంన‌గ‌ర్ బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే రాజాసింగ్‌

ఆంధ్రప్రభ, కరీంనగర్: దేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం పక్కా అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా శనివారం నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రచారంలో ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

ఈ ఎన్నికలు దేశంలో ప్రధాని ఎవరుండాల‌నే దాని కోసం జరుగుతున్నాయని, దేశ ప్రజలు రాహుల్ గాంధీ లాంటి పప్పును ప్రధాని చేయడానికి ఇష్టపడరని విమ‌ర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం ప్ర‌ధాని మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని.. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement