Friday, September 6, 2024

TS: ప్రధాని కృషి వల్లే అంతర్జాతీయ యోగా దినోత్సవం.. కేంద్ర మంత్రి బండి సంజ‌య్

కరీంనగర్, ఆంధ్రప్రభ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ కృషి వల్లే అంతర్జాతీయ యోగా దినోత్సవం దినోత్సవం జరుపుకుంటున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ‌ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ… 2014లో ఐక్య రాజ్యసమితిలో మోదీ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించడం వల్లే గత పదేళ్లుగా జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.
అన్ని రోగాలకు పరిష్కారం యోగా అని చిన్నా పెద్ద తేడా లేకుండా క్రమం తప్పకుండా యోగా చేయాలన్నారు. మన శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సు అనే నినాదంతో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement