Monday, October 21, 2024

HYD | నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె అనూష (16) బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నది.

కొద్ది రోజులుగా ఇంట్లో ఉంటున్న ఆమెను తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం కారులో తీసుకొచ్చి హాస్టల్‌ వద్ద దించి వచ్చిన కారులోనే తిరుగు పయణమయ్యారు. అయితే వారు సగం దూరం కూడా వెళ్లకుండానే హాస్టల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అనూష స్పృహ కోల్పోయిందని నిర్వాహకులు చెప్పారు. దీంతో హుటాహుటిన వారు తిరుగు పయణమయ్యారు. అక్కడి వెళ్లే సరికి అనూష ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పారు.

అయితే వారు రాకముందే మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అనూష మృతిపై ఆమె పేరెంట్స్‌ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement