నిర్మల్ ప్రతినిధి నవంబర్ 30 ప్రభా న్యూస్ )నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం టిఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి స్వగ్రామం ఎల్లాపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారుఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగే పోలింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులు జై కేసీఆర్ ఎగరవేసి మూడవసారి ప్రభుత్వం ఏర్పడబోతుందని తాను భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నానని తెలిపారు .
ఆయనతోపాటు మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తన ఓటు హక్కును ప్రియ దర్శి నగర్ లో వినియోగించుకున్నారు
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప….
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ ఫాతిమా కాన్వెంట్ స్కూల్ లో బూత్ నంబర్ 94 ఓటు వరుస సంఖ్య 891 ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మేల్యే కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి మరియు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ సతీమణి మధులిక…..
కోమరంభీం జిల్లా కాగజ్నగర్ ఫాతిమా స్కూల్ లో బూత్ నెం 98 లో ఓటు హక్కుని వినియెగించుకున్న బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ బూత్ నెం 234 లో ఓటు హక్కుని వినియెగించుకున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా పాల్వాయి హరీష్ బాబు.
సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సుమన్ ;
చెన్నూరు నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ క్యాతన పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాటశాలలో సతిమణి రాణి అలిఖ్యా తో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నరు.