Friday, September 20, 2024

TG: మ‌హిళ‌ను హింసించిన కేసులో… డీఐతో సహా ఆరుగురు సస్పెన్షన్‌

హైదరాబాద్: షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో సునీత అనే దళిత మహిళను హింసించిన కేసులో ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.

షాద్ నగర్ దళితవాడలో నివసించే నాగేందర్ తన ఇంట్లో 22.5 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ అయ్యాయంటూ జులై 24న పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ఎదురింట్లో భీమయ్య, సునీత (35) దంపతులు నివసిస్తున్నారు.

- Advertisement -

కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఈ దంపతులపై అనుమానంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. 30వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో పోలీసులు మళ్లీ వచ్చి.. రాణాకు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారని బాధిత మహిళ సునీత ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement