Thursday, September 19, 2024

TG: నిమజ్జ‌నం మార్గాల్లో హెల్త్ సెంట‌ర్స్ : దామోద‌ర రాజ‌న‌ర్శింహ

హైద‌రాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ కు లక్షలాదిగా తరలివస్తున్న గణేష్ భక్తులు, పర్యాటకులకు అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకునే వారికి సత్వరం వైద్యాన్ని అందించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. దీంతో హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాల్లో 30చోట్ల హెల్త్ క్యాంప్ లను, అంబులెన్స్ లతో డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది, మెడికల్ కిట్లను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement