Thursday, September 19, 2024

NZB: ఇందూరు ప్రజలు గర్వించేలా పనిచేస్తా… ఎంపీ ధర్మపురి అరవింద్..

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 5(ప్రభ న్యూస్) : నాపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో మరోసారి ఎంపీగా ఆశీర్వదించిన ప్రజల నమ్మకాన్ని నిలబె ట్టుకుంటూ.. ఇందూరు ప్రజలు గర్వించేలా పనిచేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడుదామని కాంగ్రెస్ వాళ్లకు ఎంపీ ధర్మపురి అరవింద సవాల్ విసిరారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజలకు అందుబాటులో లేకుండా…బుగ్గ కారులో… సైరన్ ఉంటే చాలు అంటూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లకు స్వలాభం తప్ప ప్రజా సంక్షేమం పట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌నపై నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


బుగ్గ కారు… కారులో సైరన్ ఉంటే చాలు సుదర్శన్ రెడ్డికి ..
ఇప్పటివరకు ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనైనా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు అందుబాటులో ఉండకుండా పదేపదే అధి కారులను బెదిరించడం తప్ప… అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నియోజకవర్గంలో పర్యటించకుండా హైదరాబాద్ కే పరిమితం అవుతే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.

ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలే తప్ప… ఎన్నికల్లో డబ్బులు పంచితే ఏమి వస్తుందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ సందర్భంగా తెలిపారు. ఎంపీగా గెలిచి మొదటిసారిగా జిల్లా పార్టీ కార్యాలయం వచ్చినందుకు కార్యకర్తలు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, రాష్టా కార్యదర్శి పల్లే గంగారెడ్డి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement