Thursday, September 12, 2024

WGL: ఆ ముగ్గురికి హాని చేస్తే మూల్యం చెల్లిస్తాం… మావోయిస్టుల లేఖ‌

వాజేడు, జులై 30 (ప్రభ న్యూస్) : భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ జేఎండ‌బ్ల్యూపీ డివిజన్ కమిటీ వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరిట మావోయిస్టులు సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. జేఎండ‌బ్ల్యూపీ డివిజన్ లోని ఏటూరు నాగారం, మహాదేవపూర్ దళంలోని నిరాయుధులైన ముగ్గురు సభ్యులు జై సింగ్, రమేష్, సుక్కిని ఈనెల 29వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పోలీసులు పట్టుకుని కనబడకుండా దాచిపెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ వారిని ఎన్ కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని 24 గంటల్లో కోర్టుకు హాజరు పరచాలి.. వారికి ఎలాంటి హాని జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్యత వహించాలి.

ఈ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధి జీవులందరూ ఈ అక్రమ అరెస్టులను వ్యతిరేకించండి అంటూ లేఖలో పొందుపరిచారు. సోషల్ మీడియా వేదికగా మావోయిస్టులు లేఖ‌ విడుదల చేయడంతో ములుగు జిల్లా పరిధిలోని వాజేడు వెంకటాపురం ఏజెన్సీ మండలాల్లో అలజడి మొదలైంది. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో లేఖ‌ విడుదల కావడంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పోలీసులు-మావోయిస్టుల‌ మధ్య జరుగుతున్న వార్ లో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement