హైదరాబాద్ .టీడీపీ మాజీ ఎంపీ, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటడు మురళీ మోహన్ హైడ్రా నోటీసులపై స్పందించారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు రంగలాల్ కుంట చెరువును పరిశీలించారు. బఫర్ జోన్లో మూడు అడుగుల మేరకు రేకుల షెడ్డు ఉన్నట్టు గుర్తించారు. ఆ షెడ్ తామే తొలగించేస్తామని మురళీమోహన్ తెలిపారు.
తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను.. ఏనాడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. మంగళవారంలోపు తాత్కాలిక షెడ్ తొలగిస్తామని మురళీ మోహన్ స్పష్టం చేశారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే తామే కూల్చేస్తామని హైడ్రా తన నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.