Thursday, September 12, 2024

HYDRAA – రాంనగర్‌ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆకస్మికంగా పర్యటించారు. రాంనగర్‌ చౌరస్తాలోని మణెమ్మ గల్లీలో నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదుమేరకు అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్‌ పరిశీలించారు.

మణెమ్మ గల్లీలో రోడ్డు ఇరుకుగా మారిందని, నాలా.. రోడ్డును ఆక్రమించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలోకి వరదనీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మహిళలు మొరపెట్టుకున్నారు. నాలా ఆక్రమణ, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు, సబంధిత స్థల పత్రాలను పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ, టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ అధికారులను హైడ్రా కమిషనర్‌ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement