Friday, September 20, 2024

మంత్రి కేటీఆర్ ను క‌లిసి శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్ ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని, 35 సమావేశాలు నిర్వహించి, దాదాపు రూ.7500 కోట్ల పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని, తిరిగి ఇండియాకు విచ్చేశారు. ఈ సందర్భంగా సోమ‌వారం హైదరాబాద్ లోని తారామతి బారాదారి హోటల్ (కల్చరల్ కాంప్లెక్స్ హైదరాబాద్)లో మంత్రి కేటీఆర్ ను ఉప్పల శ్రీనివాస్ గుప్తా మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement