Friday, September 20, 2024

HYD: భారతదేశపు అతిపెద్ద పరుపుల బహుమతిని ప్రకటించిన ది స్లీప్ కంపెనీ

హైదరాబాద్ : హైదరాబాదీలూ 31 ఆగస్ట్ 2024న ది స్లీప్ కంపెనీ (టీఎస్సీ) స్టోర్‌లలో మీ కలల పరుపును సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. దాదాపు రూ. 25 లక్షల విలువైన 100 ఉచిత పరుపుల బహుమతి ఆ రోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మొదట వచ్చిన వారికి, మొదట ప్రాతిపదికన అందించటం జరుగుతుంది. ఒక దశాబ్దం పాటు సుఖ నిద్ర కోసం మీరు చేయాల్సిందల్లా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కోకాపేట్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కార్ఖానాలలో ఉన్న టీఎస్ సీ స్టోర్‌కు చేరుకోవడం.

స్లీప్ కంపెనీ కోఫౌండర్, ప్రియాంక సలోట్ మాట్లాడుతూ… ప్రజలు బాగా నిద్రపోవడానికి సహాయ పడాలనే త‌మ మిషన్‌లో భాగంగా భారతదేశం అంతటా హైదరాబాద్‌తో పాటు, ముంబై, చెన్నై, ఢిల్లీలో 100 చొప్పున ఉచిత పరుపులను అందించడం ద్వారా 100వ కోకో స్టోర్ మైలురాయిని జరుపుకోవడం త‌మకు చాలా ఆనందంగా ఉందన్నారు.

- Advertisement -

ది స్లీప్ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రిపాల్ చోప్డా మాట్లాడుతూ… ఈ బహుమతి హైదరాబాదీలు త‌మ పట్ల చూపుతున్న నమ్మకం, విశ్వాసంకు త‌మదైన రీతిలో కృతజ్ఞతలు తెలిపే మార్గమ‌న్నారు. వినూత్నమైన, పేటెంట్ పొందిన స్మార్ట్ గ్రిడ్ సాంకేతికతతో, త‌మ పరుపులు వ్యక్తులకు లోతైన, కలవరపడని నిద్రను అందిస్తాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement