Saturday, September 21, 2024

TG | కిడ్నాపర్ల చెర నుంచి ఆ నేతకు విముక్తి..

ఎమ్మార్పీఎస్ నేత నరేందర్‌ను కిడ్నాపర్ల నుంచి రాజేంద్రనగర్ పోలీసులు రక్షించారు. మూడు రోజుల క్రితం బాధితుడు నరేందర్‌ను కిడ్నాప్ చేసిన ల్యాండ్ మాఫియా రెండు రోజుల పాటు శంషాబాద్‌లోని మీర్స్ బ్రదర్స్ ఫామ్‌హౌస్‌లో ఉంచి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఏడుగురు కిడ్నాపర్లలో నలుగురిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

బాధితుడిని ఫామ్‌హౌస్‌లోని వంటగది గదిలో ఉంచి 20 కుక్కలను వదిలి తీవ్రంగా హింసించారని డీసీపీ తెలిపారు. ఫామ్‌హౌస్‌లో వివిధ జాతుల కుక్కలు, గుర్రాలు, పొట్టేళ్లను నిర్వాహకులు పట్టుకున్నారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వీటన్నింటినీ పశుసంవర్థక శాఖ అధికారులకు అందజేస్తామని తెలిపారు.

భూ యజమానికి తెలియకుండా అక్రమంగా ఈ ఫామ్ హౌస్ నిర్మించారని తెలిపారు. కోర్టులో స్థలం వివాదం కొనసాగుతుండగా.. మీర్స్ బ్రదర్స్ ఫామ్ హౌస్‌ను కిడ్నాపర్లు నకిలీ ఆర్డర్ పత్రంతో నిర్మించారని డీసీపీ శ్రీనివాస్ వివరించారు. భూ యజమాని ఫిర్యాదు మేరకు వారిపై మరో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.

అసలేందుకు కిడ్నాప్ చేశారంటే..

గండిపేటలో ఓ వైద్యురాలికి చెందిన 2వేల గజాల స్థలాన్ని కొద్దిరోజుల క్రితం భూమాఫియా కబ్జా చేసింది. దీని విలువ దాదాపు రూ.20 కోట్లు ఉంటుంది. డాక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ముఠా సభ్యులు ఏపీకి చెందిన ఓ వ్యక్తికి రూ.3 కోట్లకు విక్రయించారు. మూడు రోజుల క్రితం భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ మరో వ్యక్తిని సంప్రదించి ఆ స్థలంలో పిచ్చి మొక్కలను తొలగించారు. అదే సమయంలో అక్క‌డికి చేరుకున్న‌ మరో ల్యాండ్ మాఫియా ముఠా నరేందర్‌ను కిడ్నాప్ చేసి శంషాబాద్‌కు తీసుకెళ్లింది.

- Advertisement -

దీనిపై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న (శనివారం) శంషాబాద్‌లోని మీర్స్ బ్రదర్స్ ఫామ్‌హౌస్‌లో బాధితుడిని రెండు రోజులుగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేసి బాధితుడిని రక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement