Monday, October 14, 2024

HYD: బోనాల పండుగకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.. సీపీ సుధీర్ బాబు

మల్కాజిగిరి, జులై27(ప్రభ న్యూస్) : బోనాల పండుగ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రజల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అధికారులను ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక వేడుకల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

అన్ని ప్రముఖ దేవాలయ ప్రాంగణాల్లో వాహనాల నంబర్ ప్లేట్ల చెకింగ్, పత్రాల చెకింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రదేశాల్లో బాంబు తనిఖీ బృందాల ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కల్లోలాలు రెచ్చగొట్టే పాత నేరస్తుల మీద నిఘా వేసి ఉంచాలని, వారు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement